నరేగా నిధులు చెల్లించి తీరాల్సిందే: హైకోర్టు

Telugu Lo Computer
0



దసరా నాటికి బకాయిలున్న నరేగా నిధులు చెల్లించి తీరాల్సిందేననిఆంధ్రప్రదేశ్  హైకోర్టు ఆదేశించింది. నిధులు చెల్లించడం లేదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరపున మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాల పాటి శ్రీనివాస్‌, వీరారెడ్డి, నర్రా శ్రీనివాస్‌ వాదించారు. కేంద్రం అక్టోబర్‌ 31లోపు బిల్లులు చెల్లిస్తామని అఫిడవిట్‌ ఫైల్‌ చేసిందని, ఇప్పటికే రూ.1,100 కోట్లు చెల్లించామని కేంద్రం పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాదనపై పిటిషనర్‌ తరపు న్యాయవాదుల అభ్యంతరం తెలిపారు. సోషల్‌ ఆడిట్‌ జరిగాకా మళ్లీ విచారణ పేరిట కొర్రీలు వేస్తున్నారని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. సర్పంచ్‌ అకౌంట్లలోకి నిధులు వెళ్తే ఇవ్వడంలేదని న్యాయవాదులు పేర్కొన్నారు. వారంరోజుల్లో కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించాలని సర్పంచ్‌లకు ఆదేశాలిచ్చామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)