ఏయూలో అమెరికన్‌ కార్నర్‌ ప్రారంభం

Telugu Lo Computer
0

 

విశాఖపట్నం లోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అమెరికన్‌ కార్నర్‌ ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్‌ మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా అమెరికన్‌ కార్నర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమెరికన్‌ కాన్సులేట్ జనరల్‌, మిషన్‌ డైరెక్టర్‌ వీణారెడ్డి, యునివర్సిటీ వీసీ ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడారు. దేశంలో అహ్మదాబాద్‌, హైదరాబాద్‌ తర్వాత విశాఖపట్నంలోనే అమెరికన్‌ కార్నర్‌ ఏర్పాటు చేయడం సంతోషకరమని జగన్‌ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఇదెంతో మేలు చేస్తుందని తెలిపారు. కాగా, యూఎస్‌ విద్య, ఉద్యోగాంశాల్లో సమాచారం కోసం అమెరికా కార్నర్‌ సాయపడనుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)