విశాఖపట్నం లోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అమెరికన్ కార్నర్ ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా అమెరికన్ కార్నర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ కాన్సులేట్ జనరల్, మిషన్ డైరెక్టర్ వీణారెడ్డి, యునివర్సిటీ వీసీ ప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. దేశంలో అహ్మదాబాద్, హైదరాబాద్ తర్వాత విశాఖపట్నంలోనే అమెరికన్ కార్నర్ ఏర్పాటు చేయడం సంతోషకరమని జగన్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఇదెంతో మేలు చేస్తుందని తెలిపారు. కాగా, యూఎస్ విద్య, ఉద్యోగాంశాల్లో సమాచారం కోసం అమెరికా కార్నర్ సాయపడనుంది.