దేశంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థల్లో ఒకటైన అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు, ప్రముఖ స్వామీజీ, మహంత్ నరేంద్ర గిరి స్వామీ ఆత్మహత్ కు పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్లో ఉన్న బాఘంబరి మఠంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. 5 పేజీల సూసైడ్ నోట్ను కూడా రాశారు స్వామీజీ . తన శిష్యులలో ఒకరైన ఆనంద్ గిరి ఇందుకు బాధ్యుడుగా నరేంద్ర గిరి అందులో పేర్కొన్నారు. ఫోరెన్సిక్ బృదం తో పాటు ఒక ప్రత్యేక బృందం ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించింది. మానసిక సమస్యలతో పాటు శిష్యుల వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్ లెటర్లో రాశారు నరేంద్రగిరి. తాను మరణించిన తర్వాత ఆశ్రమాన్ని ఎలా నడిపించాలో నరేంద్ర గిరి స్వామీజీ అందులో పేర్కొన్నారు. సీనియర్ పోలీస్ అధికారి కేపీ సింగ్ మాట్లాడుతూ సూసైడ్ నోట్ చదివామని తెలిపారు. ఆయన చాలా ఆందోళన చెందినట్టు ఉన్నారన్నారు. స్వామీజీ మరణం తర్వాత ఆశ్రమంలో ఏం చేయాలో కూడా వీలునామా రూపంలో రాశారని చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని తెలిపారు. కాగా, ఈ కేసులో నరేంద్ర గిరి స్వామి శిష్యుడు ఆనంద్ గిరిని హరిద్వార్లో అరెస్ట్ చేశారు.