ఎంతో ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ బాలాపూర్ లడ్డూ ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతికి చేరింది. పాత రికార్డులను బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేసి దక్కించుకున్న లడ్డును ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. సీఎం జగన్ను మర్యాదపూర్వకంగా ఎమ్మెల్సీ ఆర్ రమేష్ యాదవ్తోపాటు అబాకస్ విద్యాసంస్ధల అధినేత మర్రి శశాంక్ రెడ్డి కలుసుకున్నారు. బాలాపూర్ లడ్డు ప్రసాదంను ముఖ్యమంత్రికి కానుకగా అందించారు. బాలాపూర్లో లడ్డూ మళ్లీ రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా పాత రికార్డులు బద్దలైపోయాయి. కొత్త హిస్టరీ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు 18 లక్షల 90 వేలు పలికింది. పోటాపోటీగా సాగిన వేలంపాటలో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్తో కలసి నాదర్గుల్ వాసి మర్రి శశాంక్రెడ్డి లడ్డూను 18లక్షల 90లకు దక్కించుకున్నారు.