విజయవాడలో విస్తరిస్తున్న నయా మోసాలు

Telugu Lo Computer
0


విజయవాడ నగరంలో నయా మోసాలు విస్తరిస్తున్నాయి. అత్యాశ కొంప ముంచుతోంది. డిఆర్‌డివోలో ఉద్యోగాలు ఇపిస్తానంటే నమ్మిన ఓ మహిళా న్యాయవాది రూ.65 లక్షలు ఆన్ లైన్‌లో వేశారు. తర్వాత మోసపోయినట్లు తెలుసుకున్న న్యాయవాది.. సైబర్ పోలీసులకు పీర్యాదు చేశారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గట్టి గుండె విద్య సాగర్ అనే మోసగాడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో మరో రెండు మోసాలు వెలుగులోకి వచ్చాయి. 2019లో ఢిల్లీకి చెందిన ఓ వ్యాపార వేత్తకు విదేశాల్లో ఉండే జాతి కుక్కలు వస్తున్నాయని నమ్మించి ఆన్ లైన్ ద్వారా రూ. 17 లక్షలకు టోకరా వేశాడు. అలాగే ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని నమ్మించి మోసం చేసినట్లు సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)