విక్స్ బాక్సు మింగి బాలుడు మృతి

Telugu Lo Computer
0



విక్స్ బాక్సు మింగి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం తొర్లాయి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కట్టా కిరణ్ దంపతులు నల్గొండలో నివాసం ఉంటున్నారు. వీరికి ఏడు నెలల బాబు ఉన్నాడు. బంధువుల శుభకార్యం ఉండడంతో రెండు రోజుల క్రితం వారు తొర్లాయి గ్రామానికి వచ్చారు.

మంగళవారం ఉదయం వారి ఇంటి ఆవరణలోనే బాబు ఆడుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో బాలుడికి అక్కడే ఒక విక్స్ బాక్స్ కనిపించడంతో దాన్ని తీసుకుని నోట్లో పెట్టుకుని మింగేశాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాబును ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఊపిరాడక బాలుడు మృతి చెందాడు. దాంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవు తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)