అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని డి హిరేహాల్ మండలంలో గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న కంటైనర్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక ప్రాంతమైన తుంకూర్ నుంచి రూ.32 లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను కంటైనర్లో కర్ణాటక ప్రాంతమైన కలుగురికి తరలిస్తుండగా డి హిరేహాల్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. సుభాన్, మున్నా అనే ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న కంటైనర్ స్వాధీనం
September 20, 2021
0