పోలీసులకు పోసాని ఫిర్యాదు

Telugu Lo Computer
0


పవన్ కళ్యాణ్, పోసాని మధ్య మాటల తూటాలు పేలుతునే ఉన్నాయి. ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు రగులుతూనే ఉన్నాయి. మొన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై పోసాని క్రిష్ణమురళి దుమ్మెత్తిపోశాడు. ఆ తర్వాత పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పోసానిపై దాడికి యత్నించారు. తనకు ఏదైనా జరిగితే పవన్ దే బాధ్యత అని పోసాని ప్రకటించారు. తాజగా ఎల్లారెడ్డిపేటలో పోసాని ఇంటిపై పవన్ అభిమానుల దాడులు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈఘటనపై స్పందించిన పోసాని మళ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ లా నేనెవరిని మోసం చేయలేదని… పవన్ రౌడీయిజం చేస్తున్నారని… పవన్ లాంటి వ్యక్తి ఆవేశపరుడు రాజకీయాలకు పనికిరాడని..మమ్మల్ని బూతులు తిడుతూ ఉంటే ఊరుకోవాలా..? ఊసరవెళ్లి రాజకీయాలను ప్రశ్నిస్తే తప్పా..? అని తీవ్రంగా విమర్శించారు. ఘటనపై ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ రాజకీయ విమర్శలతో మొదలైన రగడ అ తర్వాత పవన్ వర్సెస్ వైసీపీ, పవన్ వర్సెస్ పోసానిగా మారింది. వివాదం వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. ఇంకా ఎన్ని రోజులు ఈవివాదం జరుగుతుందో చూడాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)