తెలంగాణ రాష్ట్రం లోని నిర్మల్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. గంజాల్ టోల్ ప్లాజా దగ్గర పంట రక్షణకై వేసిన విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్తో రైతు బోనగిరి సతీశ్ (30) మృతి చెందాడు. రైతు కుటుంబానికి న్యాయం చేయాలంటు గ్రామస్తుల ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ స్థానికుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతుడి కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Post a Comment
0Comments
3/related/default