ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో దొంగల ముఠా హల్చల్ చేసింది. నంద్యాల పానిపట్టి వీధిలోని ఓ ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు. 35 తులాల బంగారం, 150 తులాల వెండి, లక్షా 38 వేల నగదు దుండగులు ఎత్తుకెళ్ళారు. భాధితులు పోలీసులకు సమాచారం అందిచారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. భాధితులను అడిగి విషయం తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.