15 న పౌరుల తొలి అంతరిక్ష యాత్ర

Telugu Lo Computer
0


స్పేస్‌ఎక్స్‌ మిషన్‌ ద్వారా తొలిసారి అంతరిక్షంలోకి పౌరులు వెళ్లేందుకు అంతా సిద్ధమైంది. ఈ నెల 15 న 'ఇన్‌స్పిరేషన్ 4' కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. బిలియనీర్ ఎలోన్ మస్క్ ఆధ్వర్యంలో స్పేస్‌ఎక్స్ మిషన్‌ కొనసాగుతున్నది. ఇప్పటికే ఎలోన్‌ మస్క్‌తో పాటు ఐదుగురు అంతరిక్ష యాత్ర చేసి విజయవంతంగా తిరిగొచ్చారు. దాంతో అంతా పౌరులే వెళ్లే మిషన్‌కు స్పేస్‌ ఎక్స్‌ సంస్థ పచ్చ జెండా ఊపింది. సెప్టెంబర్ 15 న ఇన్‌స్పిరేషన్ 4 మిషన్ బయల్దేరుతుందని స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ఒక ట్వీట్‌లో పేర్కొన్నది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌లోని నాసా ప్యాడ్‌ 39 ఏ నుంచి స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌ నింగిలోనికి దూసుకుపోనున్నది. మిషన్‌ ప్రారంభానికి కొన్నిరోజుల ముందే లిఫ్ట్‌ ఆఫ్‌ సమయం నిర్ణయించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)