ప్రేమ పేరుతో యువతికి వల!
August 04, 2021
0
విజయవాడ చిట్టినగర్కు చెందిన తస్నీమ్ ఫాతిమా హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని హత్నికుండ్ డ్యామ్లో పడేసిన యువతి మృతదేహాం ఈ రోజు లభ్యమయ్యింది. ఉత్తరప్రదేశ్ పోలీసుల అదుపులో ఉన్న నిందితులను విజయవాడ తీసుకువచ్చేందుకు పోలీసులు ఉత్తరప్రదేశ్ బయలు దేరి వెళ్లారు. విజయవాడ చిట్టినగర్ కు చెందిన ఫాతిమా (21)కు మానసిక స్ధితి సరిగా లేకపోవటంతో ఆమె తండ్రి మాలానా నజీర్ ఉత్తరప్రదేశ్ కు చెందిన వాసిఫ్ అనే భూతవైద్యుడ్ని సంప్రదించాడు. ఆమెకు వైద్యం చేసేందుకు వాసిఫ్ విజయవాడ వచ్చాడు. ఫాతిమాకు భూతవైద్యం చేసాడు. భూత వైద్యం జరుగుతున్నసమయంలో వాసిఫ్ తన స్నేహితుడు తయ్యబ్ సాయంతో ఫాతిమాను ట్రాప్ చేశాడు. ఆ యువతి వాసిఫ్ మాయమాటలను నమ్మింది. ఈక్రమంలో జులై 10వ తేదీన వాసిఫ్,తయ్యబ్లు ప్రేమ పేరుతో యువతిని ఉత్తరప్రదేశ్ తీసుకువెళ్లారు. ఆమె వంటిమీద ఉన్న15 తులాల బంగారాన్ని తీసుకుని యువతిని హత్య చేసి హత్నికుండ్ డ్యామ్లో పడేశారు