మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
August 22, 2021
0
ఆదివారం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం వర్చువల్ గా నిర్వహించారు. ఆ సమావేశంలో సీనియర్ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మా' భవనం కోసం రూపాయికి కొన్న స్థలాన్ని అర్థ రూపాయికే అమ్మేశారని ఆరోపించారు. అందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మా భవనం కోసం డబ్బు కూడబెట్టి, స్థలం కొని, మళ్లీ దాన్ని సగం ధరకు అమ్మేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దానిపై ఎవరైనా మాట్లాడారా అని నిలదీశారు. దీనిపై పెద్దలు ఆలోచించాలని కోరారు.