ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గినా, మరణాలు మాత్రం పెరిగాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 82,297 శాంపుల్స్ ని పరీక్షించగా 2,145 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 36, చిత్తూరు జిల్లాలో 369, తూర్పుగోదావరి జిల్లాలో 428, గుంటూరు జిల్లాలో 181, కడప జిల్లాలో 103, కృష్ణాజిల్లాలో 251, కర్నూలు జిల్లాలో 54, నెల్లూరు జిల్లాలో 304, ప్రకాశం జిల్లాలో 160, శ్రీకాకుళం జిల్లాలో 34, విశాఖపట్నం జిల్లాలో 89, విజయనగరం జిల్లాలో 28, పశ్చిమగోదావరి జిల్లాలో 108 పాజిటివ్ కేసులు మోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 19,76,141కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 19,42,371 మంది కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో 2,003 మంది కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20,302గా ఉంది. రాష్ట్రంలో గత 24గంటల్లో 24 మంది మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 13,468 కి చేరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)