ప్రియుడి ఆత్మహత్య

Telugu Lo Computer
0


సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్‌ మండలం బూరుగడ్డలో ప్రేమికుల జంట బలవన్మరణానికి పాల్పడింది. ముందుగా మౌనిక అనే యువతి గురువారం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకోగా, ప్రియురాలు మరణం తట్టుకోలేక మనస్థాపంతో ప్రియుడు పవన్‌ కూడా పురుగుల మందు తాగి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల వ్యధిలో ప్రేమికులిద్దరూ ప్రాణాలు వదలడంతో హుజూర్‌ నగర్‌లో విషాద చాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా పురుగుల మందు సేవిస్తూ ప్రియుడు పవన్ తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)