రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) వాటర్ బాటిళ్లకు, ఇతర ప్లాస్టిక్ వస్తువులకు వాడే పాలిథిలిన్ టెరాఫ్తలెట్ రీసైక్లింగ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసైకిల్ పాలిస్టర్ స్టేపుల్ ఫైబర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ తయారీ కేంద్రాన్ని శ్రీచక్ర ఎకోటెక్స్ ఇండియా, ఆర్ఐఎల్ కోసం ప్రత్యేకంగా రీసైకిల్ చేసిన పీఎస్ఎఫ్-రెక్రాన్ గ్రీన్ గోల్డ్, పెట్ ఫ్లాక్స్ వాష్-లైన్ను ఆంధ్రప్రదేశ్లో నిర్మించనుంది. అంతేకాకుండా తయారీ కేంద్రాన్ని శ్రీచక్ర ఎకోటెక్స్ ఇండియా ఆపరేట్ చేయనుందని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఏపీలో రిలయన్స్ రీసైక్లింగ్ యూనిట్లు
August 04, 2021
0