ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమి ఎంఐ కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల మొబైళ్లు, ట్యాబ్లెట్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. అత్యాధునిక ఫీచర్స్ను జోడించి కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. Xiaomi Mi Padను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇటీవల ఈ షియోమి ఎంఐ ప్యాడ్ 5 చైనాలో పరిశ్రమ, సమాచారం సాంకేతిక మంత్రిత్వశాఖ నుంచి ధృవీకరణ పత్రం పొందిందింది. అయితే ఎంతో మంది వినియోగదారులు ట్యాబ్లెట్లను వినోదం కోసం, ఆఫీస్కు సంబంధించి పనుల కోసం ఉపయోగిస్తుంటారు. ఇందులో పెద్ద స్క్రీన్టచ్ ఉండడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. షియోమి ఎంఐ ప్యాడ్ను ఇష్టపడే వారితో సహా అందరు వినియోగదారులకు నచ్చే తరహాలో దీనిని రూపొందించారు.