ఏపీ విద్యార్థులకు మైగ్రేషన్ సర్టిఫికెట్
August 23, 2021
0
పదవ తరగతి తరువాత ఇతర రాష్ట్రాల్లో విద్యనభ్యసించే రాష్ట్రంలోని విద్యార్థుల కోసం మైగ్రేషన్ సర్టిఫికెట్ను ఆన్లైన్ ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేశామని ఏపీ పరీక్షల సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. మైగ్రేషన్ సర్టిఫికెట్ను ఎనభై రూపాయలు రుసుము చెల్లించి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. 2004 నుంచి 2020 మధ్య ఉత్తీర్ణులు అయిన వారు సైతం మైగ్రేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఈనెల 24 నుంచి www.bse.ap.gov.in వెబ్సైట్లో మైగ్రేషన్ ధరఖాస్తు డౌన్లోడ్కు అవకాశం ఇస్తున్నట్టు ప్రకటనలో ఆయన వెల్లడించారు.