నీరజ్ కు స్వర్ణం

Telugu Lo Computer
0


ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు.ఈరోజు  జరిగిన పురుషుల జావెలిన్ త్రోయర్ ఫైనల్స్‌లో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. జపాన్ నడిబోడ్డుపై భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాడు. అద్భుత ప్రదర్శనతో భారత్ ఖాతాలో పసిడి లేని లోటు తీర్చాడు. మీరాభాయి చాను రజతంతో ఖాతా తెరిస్తే.. నీరజ్ చోప్రా స్వర్ణంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత ప్రస్థానాన్ని ఘనంగా ముగించాడు. ఒలింపిక్స్‌కు ఆదివారం చివరి రోజు అయినప్పటీకీ భారత్‌ అథ్లెట్ల పోటీకి మాత్రం శనివారమే ఆఖరు.

Post a Comment

0Comments

Post a Comment (0)