ఆటోలో టాయ్ లెట్...!

Telugu Lo Computer
0


సుష్మ కల్లెంపూడి అనే మహిళ.. 2017లో అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చింది. హైదరాబాద్ లో మహిళలు బయటకు వెళ్లినప్పుడు టాయ్ లెట్ కోసం ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని షీ టాయ్ లెట్ ఆవిష్కరణ చేసింది. ఓ ఆటోను మొబైల్ షీ టాయ్ లెట్ మార్చింది. ఈ ఆటోను జీహెచ్ఎంసీ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చూపించింది. మొబైల్ షీ టాయ్ లెట్ వల్ల రద్దీ ప్రాంతాల్లో మహిళలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని, పర్యావరణ హితంగా పని చేస్తాయని గుర్తించిన ప్రభుత్వాలు ఇలాంటి ఆటోలను మరిన్ని ఏర్పాటు చేయటానికి ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో 25 ఆటోలు వీధుల్లో తిరుగుతున్నాయి.

ఒక్కో ఆటో తయారీకి 4 లక్షల రూపాయలు ఖర్చవుతుందని వివరించారు సుష్మ. మొబైల్ షీ ఆటోలో 100 లీటర్ల కెపాసిటీ వాటర్ ట్యాంక్, అద్దం, హ్యాంగర్, వాష్ బేసిన్, ఫ్లెష్, డ్రైనేజ్ సిస్టమ్ ఉంటాయి. అదే విధంగా చంటి పిల్లలకు డైపర్స్ మార్చుకోవటానికి అనువుగా స్థలం ఉంది. మహిళలకు అత్యవసరంగా కావాల్సిన శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా ఉంటాయి. శానిటరీ న్యాప్కిన్స్, సెల్ ఫోన్ ఛార్జింగ్ పాయింట్ ఉన్నాయి. ప్రతి ఆటోకు జీపీఎస్ కనెక్టెవిటీ ఉంది. పాత ఆటోలను ఈ విధంగా మార్చటం జరిగిందని,  మంచి స్పందన వస్తుంది అంటున్నారు  సుష్మ. స్వచ్ఛభారత్ తో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహం అందిస్తే, వందలాది వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ మహిళ క్రియేటివిటీకి ప్రపంచం మొత్తం ఔరా అంటోంది. చాలా దేశాలు ఈ ఆలోచనను స్వాగతిస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)