నేను లోటస్‌పాండ్‌కు వెళ్ళలేదు

Telugu Lo Computer
0


తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం, మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనపై వస్తున్న వార్తలపై స్పందించారు. వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య భేటీ అయ్యారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై సోమవారం మీడియాతో మాట్లాడిన రాజయ్య తాను లోటస్‌పాండ్‌కు వెళ్లలేదని చెప్పారు. బ్రదర్ అనిల్‌ను కలవలేదన్నారు. పాత ఫొటోలతో పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారాలు చేయొద్దని కోరారు. వ్యక్తిగత పరిచయాలను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని, అసత్య ప్రచారాలు చేసి మనసు గాయపర్చవద్దని విన్నవించారు. ''నా జీవితాంతం టీఆర్ఎస్‌లోనే ఉంటా. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎంగా చరిత్రలో నిలిచిపోయేలా కేసీఆర్ నాకు భిక్ష పెట్టారు. మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేకపోయారు కాబట్టే కేసీఆర్ దళిత ఎంపవర్‌మెంట్ తెచ్చారు'' అని రాజయ్య చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)