పురుషుల హాకీలో కాంస్య పతకం

Telugu Lo Computer
0


టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు 5-4 తేడాతో జర్మనీపై విజయం సాధించి కాంస్య పతకం  గెలుచుకుని చరిత్ర సృష్టించింది. దీంతో ఒలింపిక్స్‌లో హాకీ పోటీల్లో పతకం కోసం 41 ఏళ్ల ఎదురుచూపులకు తెరపడి దేశవ్యాప్తంగా సంబరాలకు తెరలేసింది. ఒలింపిక్స్‌లో భారత్ సత్తా చాటిన హాకీ క్రీడాకారులకు దేశం నలుమూలల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు, ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

మ్యాచ్ ఆరంభంలో భారత్‌పై జర్మనీ పైచేయి సాధించినప్పటికీ.. సిమ్రంజీత్ సింగ్, హార్దిక్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్ చక్కటి ప్రదర్శన కనబర్చడంతో జర్మనీపై భారత్ విజయం సాధించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)