తాడేపల్లి అత్యాచార ఘటనలో నిందితుల అరెస్టు

Telugu Lo Computer
0


గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో జరిగిన అత్యాచార ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ అరీఫ్ హఫీజ్ మాట్లాడుతూ అత్యాచార ఘటనలో నిందితుల అరెస్టు కోసం పోలీసులు తీవ్రంగా కష్టపడ్డారని అన్నారు. జులై 19 రాత్రి సమయంలో అత్యాచార ఘటన జరిగిందన్నారు. నిందితుడు కృష్ణ కిషోర్ ని విజయవాడ రైల్వే ట్రాక్ పై పట్టుకున్నామని తెలిపారు. కృష్ణకు సంబంధించి ఆధారాలు దొరకడం ఆలస్యమైందని అన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కృష్ణ కిషోర్ కాగా షేక్ హబీబ్ కూడా ఈ నేరంలో పాలుపంచుకున్నాడని పేర్కొన్నారు. అత్యాచారానికి ముందు వీరు ఒకరిని హత్య చేశారని తెలిపారు. రైల్వే వంతెనపై రాగి తీగలు చోరీ చేస్తుండగా వీరిని చూసిన శనక్కాయలు అమ్ముకునే వ్యక్తిని హత్య చేశారని తెలిపారు. అతని మృతదేహాన్ని కృష్ణా నదిలో పడేశారని అన్నారు. విచారణలో కృష్ణ కిశోర్ ఆ విషయం అంగీకరించారని ఎస్పీ తెలిపారు. ఆ తర్వాత కృష్ణాతీరంలో ఉన్న జంటను చూసి, ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. గతంలో వీరికి నేర చరిత్ర ఉందని, చిల్లర దొంగతనాలు, దాడులు చేసిన నేరాలు వీరిపై ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కేసులో మరో నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడని తెలియజేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)