కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఎండీ అరెస్ట్

Telugu Lo Computer
0


కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండస్ ఇండ్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం ఎగవేత కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండస్ ఇండ్ బ్యాంకు నుంచి కార్వీ సంస్థ రూ.137 కోట్ల మేర రుణం తీసుకుంది. అయితే నిర్దేశిత గడువు లోపు కార్వీ రుణం తిరిగి చెల్లించలేదంటూ ఇండస్ ఇండ్ బ్యాంకు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదు నేపథ్యంలో పార్థసారథిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

Post a Comment

0Comments

Post a Comment (0)