తిరుచ్చి జిల్లాకు చెందిన ధనలక్ష్మికి టోక్యో ఒలింపిక్ పోటీల్లో పరుగు పందెంలో పాల్గొనేందుకు అవకాశం లభించి, పంజాబ్ రాష్ట్రం పాటియాలలో శిక్షణ పొందిన ధనలక్ష్మి అక్కడి నుంచే ఒలింపిక్స్లో పాల్గొనేందుకు టోక్యో వెళ్లింది. ఈ క్రమంలో, గత నెల 12వ తేది ధనలక్ష్మి సోదరి మృతి చెందింది. అయితే ఈ విషయం తెలిస్తే ఆమె పోటీల్లో పాల్గొనలేదన్న ఉద్దేశంతో ఆమె తల్లి ఉష ఈ విషయాన్ని ధనలక్ష్మికి చెప్పకుండా దాచిపెట్టారు. పోటీల్లో పాల్గొని ఆదివారం తిరుచ్చి విమానాశ్రయానికి వచ్చిన ఆమెకు అభిమానులు ఉత్సాహంగా స్వాగతం పలికారు. అంతలోనే అక్క మృతి చెందిందనే వార్త తెలిసి ధనలక్ష్మి విమానాశ్రయంలోనే బోరున విలపిస్తూ కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఓదార్చడంతో చాలాసేపటికి ఆమె కోలుకోగలిగింది.
Post a Comment
0Comments
3/related/default