విద్యార్థి నేత దారుణ హత్య

Telugu Lo Computer
0


పంజాబ్ లో దారుణ ఘటన జరిగింది. అకాలీదళ్ విద్యార్థి నేత విక్కీ ముద్దుఖేరను గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన మతౌర్ మార్కెట్‌ లో జరిగింది. ఘటనపై మొహాలీ ఎస్పీ సతీందర్ సింగ్ స్పందించారు. మతౌర్ మార్కెట్‌ కి వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో దుండగులు అతడిపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. కాల్పుల శబ్దం విన్న విక్కీ పారిపోయేందుకు కారు దిగి పరిగెడుతుండగా దుండగులు వేటాడి కాల్పులు జరిపి హత్య చేశారని వివరించారు. నలుగురు దుండగులు విక్కీపై 8 నుంచి 9 రౌండ్ల కాల్పులు జరిపారు అని మొహాలీ ఎస్పీ పేర్కొన్నారు. విక్కీ హత్యపై విచారణ కొనసాగుతుందని వివరించారు. అతడి స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులను ప్రశ్నించామని, ఘటన స్థలికి సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామని తెలిపారు. ద్వారలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్పీ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)