భార్యను హత్యచేసిన భర్త
August 09, 2021
0
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం అన్నెబోయినపల్లెలో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను హత్య చేశాడు. . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొటికలపూడి నరసింహం, రమణమ్మ (47) భార్యాభర్తలు. వివాహేతర సంబంధం పెట్టుకుందనే నెపంతో నరసింహం రోజు మద్యం తాగి వచ్చి ఆమెపై దాడి చేసేవాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం తెల్లవారుజామున భార్యతో గొడవకు దిగి తీవ్ర ఆగ్రహంతో ఆమె గొంతు కోశాడు. దీంతో రమణమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఇరుగు పొరుగు వారు ఘటన విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.