విజయవాడ నగరంలో చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తున్న చెరుకూరి సింధు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సింధుది హత్యేనని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సింధుతో సన్నిహితంగా ఉండే ప్రసేన్పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ అనంతరం ప్రసేన్కు చెందిన ఇంట్లోనే సింధు ఉంటున్నది. ఇద్దరి ప్రేమ వివాహానికి రెండు కుటుంబాలు అంగీకరించలేదు. తరచూ సింధు దగ్గరకు ప్రసేన్ వచ్చి వెళ్తున్నాడు. సింధు మృతి ఘటన మాచవరం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. తమకు న్యాయం చేయాలని ఎంపీ కేశినేని నానిని కుటుంబ సభ్యులు కలిసారు.
Post a Comment
0Comments
3/related/default