తమిళనాడు లోని మదురై జిల్లా చోళవందాన్ రాయపురంకు చెందిన గ్లాడిస్రాణి (21) కి అదే ప్రాంతానికి చెందిన జ్యోతిమణి (23)కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఉల్లాసంగా గడపడంతో రాణి ఐదు నెలల గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న రాణి తల్లిదండ్రులు జ్యోతిమణి తల్లిదండ్రులతో మాట్లాడగా వారు నిరాకరించినట్టు సమాచారం. అనంతరం ఇరు కుటుంబాల మధ్య చర్చల ఫలితంగా ఈనెల 2వ తేదీ వివాహం జరిగింది. 4వ తేదీ భార్యను జ్యోతిమణి పెరియార్నగర్లోని తమ ఇంటికి తీసుకెళ్లాడు. మరుసటిరోజు రాణి కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులకు జ్యోతిమణి సమాచారం అందించాడు. దీంతో, దిగ్ర్భాంతి చెందిన వారు చోళవందాన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు జ్యోతిమణి తీరును సందేహించి చేపట్టిన విచారణలో, అవనియాపురం జాతీయ రహదారి పక్కన రాణిని సజీవదహనం చేసినట్టు అంగీకరించడంతో, పోలీసులు అతనిని అరెస్టు చేశారు.
Post a Comment
0Comments
3/related/default