ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య యత్నం

Telugu Lo Computer
0


విజయవాడ, ప్రసాదంపాడులో ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 48గంటలు గడిచే వరకు ఏమి చెప్పలేమని వైద్యులు తెలిపారు. ఆమె ఇద్దరు పిల్లలు రెయిన్‌బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె భర్త ఏడాది క్రితం కోవిడ్‌తో మృతి చెందాడు. ఆస్తి వ్యవహారం వల్లనే ఆత్త, మామల మధ్య గొడవలు, విబేధాలు వచ్చినట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)