యుద్ధం సంపూర్ణం : తాలిబన్లు

Telugu Lo Computer
0


అఫ్ఘానిస్థాన్‌లో యుద్ధం సంపూర్ణంగా ముగిసిందని తాలిబన్లు తాజాగా ప్రకటించారు. అంతేకాకుండా..త్వరలో అఫ్ఘానిస్థాన్‌ను ఇస్లామిక్ ఎమిరేట్‌గా ప్రకటిస్తామని కూడా పేర్కొన్నారు. తాలిబన్లు రాజధానిని చుట్టుముట్టడంతో ఆదివారం నాడు అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే.. రక్తపాతాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని తాజాగా ఆయన ఓ ఫేస్‌బుక్ పోస్టులో చెప్పుకొచ్చారు. ఆయన నిర్ణయం పట్ల అఫ్ఘాన్‌ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. పాశ్చాత్య దేశాలు తమ సిబ్బందిని వేగంగా స్వదేశానికి తరలించేందుకు ప్రస్తుతం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాలిబన్ల ధాటికి అఫ్ఘాన్ సేనలు చెల్లాచెదరడవడంతో.. ఊహించిన దానికంటే ముందుగానే అఫ్ఘాన్ వారి వశమైన విషయం తెలిసిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)