శిథిలాల కింద బస్సు, ట్రక్కు

Telugu Lo Computer
0


హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడడంతో  కొండరాళ్ల మధ్య ట్రక్కు, బస్సు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రిక్‌కాంగ్ పియో-షిమ్లా జాతీయ రహదారిపై ఉన్న కిన్నౌర్ వద్ద ఈ ఘటన జరిగింది.  ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల హిమాచల్ ప్రదేశ్‌లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. అయితే ఈరోజు ఘటనలో ఎంత మంది  చనిపోయారో ఇంకా తెలియరాలేదు. శిథిలాల కింద ఓ ట్రక్కు, బస్సుతో పాటు ఇతర వాహనాలు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇండో-టిబెట్ బోర్డర్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)