హిమాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడడంతో కొండరాళ్ల మధ్య ట్రక్కు, బస్సు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రిక్కాంగ్ పియో-షిమ్లా జాతీయ రహదారిపై ఉన్న కిన్నౌర్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల హిమాచల్ ప్రదేశ్లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. అయితే ఈరోజు ఘటనలో ఎంత మంది చనిపోయారో ఇంకా తెలియరాలేదు. శిథిలాల కింద ఓ ట్రక్కు, బస్సుతో పాటు ఇతర వాహనాలు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇండో-టిబెట్ బోర్డర్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
శిథిలాల కింద బస్సు, ట్రక్కు
August 11, 2021
0