వింత వివాహం !

Telugu Lo Computer
0



కర్ణాటక రాష్ట్రంలో కవితాల మండలంలో జరిగిన ఓ వివాహం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 12 ఏళ్ల బాలుడు 30 ఏళ్ల యువతితో వివాహం చేశారు. అయితే ఈ వివాహం చేయడానికి పెద్ద కారణం ఉందట!. ఈ కారణం చేత వయసుతో సంబంధం లేకుండా వివాహం చేయడంపై పలు విమర్శలు వస్తున్నా ఆ జంటను మాత్రం కాపురానికి పంపారు. బాలుడి తండ్రి మద్యానికి బానిసై చనిపోయాడు. తన ఇద్దరు కుమారులకు పెళ్లి ఎలా చేయాలో తెలియక తల్లి బాధపడింది. దీంతో అమ్మాయి ఎవరైనా సరే ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో దూరపు బంధువులైన ఒకరు వరుసైన ఓ యువతితో వివాహం చేయాలని నిర్ణయించారు. అయితే ఆ యువతి వయసు 30 ఏళ్లు. ఆమెకు ఇంత వరకు పెళ్లి కాలేదు. బాలుడి తల్లి ఆ యువతితో వివాహం చేయడానికి ఒప్పుకుంది. జూన్ 27న జరిగిన ఈ వివాహాన్ని పెద్దల సమక్షంలో ఈ పెళ్లి జరగడంతో కొందరు ఈ వివాహం చూసి షా..క్ అయ్యారు. మరికొందరు పెద్దలను తిట్టిపోశారు. ఇందుకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాకు రావడంతో వైరల్ అవుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)