ఆర్‌బీఐకి స్థలం కావాలి

Telugu Lo Computer
0


రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అదనపు కార్యాలయ స్థలం కోసం చూస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రధాన కార్యాలయానికి  సమీపంలో లేదా బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ (బీకేసీ) ప్రాంతంలో 2,601-7,681 చదరపు మీటర్ల  కార్యాలయ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా ఆర్‌బీఐ కోరింది. ప్రధాన కార్యాలయానికి 1.5 కిలోమీటర్లలోపు ఈ అదనపు కార్యాలయం ఉండేలా ప్రతిపాదనలు ఇవ్వాలని ఆసక్తి ఉన్న సంస్థలకు సూచించింది. ఒకవేళ విక్రయానికి ఎవరూ ముందుకు రాకపోతే, 30 ఏళ్ల కాలానికి లీజు ప్రాతిపదికన వచ్చినా పరిశీలిస్తామని తెలిపింది. సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలో గ్రేడ్‌ ఏ కార్యాయాల చదరపు అడుగు రూ.25,000-50,000 మధ్య ఉండగా, బీకేసీ ప్రాంతంలో రూ.45,000-65,000 మధ్య ఉన్నట్లు జేఎల్‌ఎల్‌ ఇండియా ప్రాంతీయ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కరణ్‌ సింగ్‌ వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)