లవ్లీనాకు కాంస్యం
August 04, 2021
0
భారత ఖాతాలో మరో ఒలింపిక్స్ పతకం చేరింది. ఎలాంటి అంచనాల్లేకుండా బరిలోకి దిగిన ఈశాన్య రాష్ట్రానికి చెందిన బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల వెల్టర్ వెయిట్ (64-69 కిలోలు) విభాగంలో బరిలో నిలిచిన ఆమె సెమీ ఫైనల్ లో ఓడిపోయింది. ఈరోజు జరిగిన బౌట్ లో టర్కీకి చెందిన బిజినెజ్ సర్మినెలి చేతిలో ఓటమిపాలైంది.విజేందర్ సింగ్, మేరీకోమ్ తర్వాత భారత్ కు ఒలింపిక్స్ పతకాన్ని అందించిన మూడో బాక్సర్ గా లవ్లీనా చరిత్ర సృష్టించింది.