నేటితో ఆషాఢ బోనాలు సమాప్తం

Telugu Lo Computer
0


నేటితో హైదరాబాద్‌లో బోనాల సందడి ముగియనుంది. గోల్కోండ కోటలో తొలివారం ఆ తర్వాత సికింద్రాబాద్ లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ముగిశాయి. పాతబస్తీ లాల్ దర్వాజ అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు జరిగే రంగం కార్యక్రమంతో లాల్‌దర్వాజ సింహ వాహిని అమ్మవారి ఆలయంలో బోనాలు ఉత్సవాలు ముగియనున్నాయి. ఆదివారం ఉదయం నుంచే సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు, మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆదివారం రోజున పెద్ద ఎత్తున మహిళలు బోనాలు సమర్పించారు. ఈరోజు లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో రంగం కార్యక్రమం, అమ్మవారి అంబారీ ఊరేగింపు కార్యక్రమాలు జరుగనున్నాయి. పలహారం బండ్లు, ఘటాల ఊరేగింపుతో బోనాల వేడుకల ముగియనున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)