నేను బతికే ఉన్నాను

Telugu Lo Computer
0


అలనాటి దిగ్గజ నటి, ఊర్వశి శారద కన్నుమూశారంటూ ఆదివారం ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్‌చల్‌ చేశాయి. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలోని నటీనటులతో పాటు, ఆమె అభిమానులు సైతం ఆందోళనకు గురయ్యారు. ఆ వార్తలు నిజమా? కాదా? అన్న దానిపై స్పష్టత కోసం వేచి చూశారు. విషయం తెలుసుకున్న శారద సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై స్పష్టత ఇచ్చారు.

‘నేను బతికే ఉన్నాను. నా ఆరోగ్యం బాగానే ఉంది. కాకపోతే ఒంట్లో కాస్త నలతగా ఉంది. దయచేసి వాట్సాప్‌లలో వచ్చే వాటిని నమ్మకండి. ఒక వ్యక్తి చేసిన పనికి అందరూ ఆందోళన చెందుతున్నారు. నా అభిమానులు, శ్రేయోభిలాషులు ఇలాంటి వార్తలు నమ్మొద్దు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటివి వ్యాప్తి చేయడం బాధాకరం’ అని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)