ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కార్తికేయపురానికి చెందిన మహిళా కానిస్టేబుల్ సుకన్య (29) తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పని చేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం తమ గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.