మార్కెట్లోకి కొత్త వెస్పా స్కూటర్స్

Telugu Lo Computer
0

  


ఇండియా మార్కెట్లో ఎట్టకేలకు పియాజియో ఇండియా తన కొత్త వెస్పా 75 వ యానివర్సరీ ఎడిషన్‌ ను విడుదల చేసింది. ఈ కొత్త వెస్పా స్కూటర్ ధర రూ.1.25 లక్షలతో ప్రారంభించింది.  కొనుగోలుదారులు  ఆన్‌లైన్‌లో ఇంకా కంపెనీ అధికారిక డీలర్ల వద్ద  రూ. 5,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి  బుక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ వచ్చేసి  Vespa 75th Anniversary Edition 125 ఇంకా Vespa 75th Anniversary Edition 150  వేరియంట్లలో  అందుబాటులో ఉంటుంది. స్కూటర్ కొత్త మెటాలిక్ ఎల్లో కలర్ లో చాలా స్టైలిష్ గా ఉంది. దీనితో పాటు ఈ స్కూటర్ లోని సైడ్ ఆప్రాన్ ఇంకా మడ్‌గార్డ్‌పై 75 నెంబర్ మనం చూడవచ్చు. ఇది 75 వ వార్షికోత్సవాన్ని తెలుపుతుంది. అలాగే దీనికి లైట్ గ్రే కలర్ లో ఫినిషింగ్ ఉంది.ఇక అంతే కాకూండా క్రోమ్‌తో 75 యానివర్సరీ ఎడిషన్‌ అని చెక్కబడి ఫలకం కూడా ఉంది.ఇది స్కూటర్ ముందు స్టోరేజ్ కంపార్ట్‌మెంట్‌లో మనం చూడవచ్చు.ఇక ఈ కొత్త Vespa 75th Anniversary Edition స్కూటర్ లో గమనించదగ్గ మార్పు ఏంటంటే.. అది ఇందులోని రౌండ్ ఆకారపు బ్యాగ్‌.పాత మోడల్స్ లో ఈ ప్రాతంలో ఒక విడి టైర్ ఉండేది. ఇది నోబుక్ లెదర్‌లో ఫినిష్ చేశారు.ఇక అది క్రోమ్ ర్యాక్‌లో ఉంటుంది. మొత్తానికి ఇది చూడటానికి చాలా సింపుల్ గా ఇంకా ఎంతో స్టైలిష్ గా ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)