రూ.9 వేలలోపే రెడ్‌మీ కొత్త ఫోన్ !

Telugu Lo Computer
0


షియోమీ తన రెడ్‌మీ 9సీ స్మార్ట్ ఫోన్‌లో కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఇది మొదట మలేషియాలో లాంచ్ అయింది. మనదేశ కరెన్సీలో రూ.9 వేలలోపే దీని ధరను నిర్ణయించారు. ఇందులో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. గతంలో ఇందులో 2 జీబీ ర్యామ్/3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్/64 జీబీ స్టోరేజ్ వేరియంట్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు కొత్తగా హైఎండ్ వేరియంట్‌ను కూడా తీసుకువచ్చారు. ధరను 499 మలేషియా రింగెట్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.8,780) నిర్ణయించారు.  బ్లూ, ఆరెంజ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.53 అంగుళాల హెచ్ డీ+ ఎల్సీడీ డాట్ డ్రాప్ డిస్ ప్లేను అందించారు. దీని డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 4 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ను అందించారు. స్టోరేజ్ ను మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. దీనిలో వెనకవైపు మూడు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కెమెరా కాగా, 5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ బరువు 194 గ్రాములుగా ఉంది. 4జీ ఎల్టీఈ, ఐఆర్ బ్లాస్టర్, వైఫై, మైక్రో యూఎస్‌బీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఇందులో కూడా అందించారు. ఇందులో వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే ఏఐ ఫేస్ అన్ లాక్ ఫీచర్ కూడా ఉంది.


Post a Comment

0Comments

Post a Comment (0)