20 ఏళ్ల కష్టం పోయింది...!

Telugu Lo Computer
0


అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకి భయాందోళనలు కలిగిస్తున్నాయి. అవకాశం వస్తే.. ఆ దేశం దాటిపోవడానికి లక్షలాది మంది ప్రజలు ప్రయత్నిస్తున్నారు. దీంతో నిత్యం అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అనేక దేశాలు తమ దేశ పౌరులను ప్రత్యేక విమానాల ద్వారా అఫ్గాన్‌ నుంచి తరలిస్తున్నాయి. తాజాగా అఫ్గాన్‌ నుంచి ఓ ప్రత్యేక విమానంలో 168 మంది భారత్‌ చేరుకున్నారు. అఫ్గానిస్తాన్‌ ఎంపీ నరేందర్‌ సింగ్‌ ఖల్సా కాబూల్‌ నుంచి భారత్‌కు చేరుకున్న సందర్భంగా మాట్లాడుతూ..'' నాకు ఏడుపు వస్తోంది. గత 20 ఏళ్లలో సాధించినదంతా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు మిగిలింది సున్నా " అని నరేందర్ సింగ్ ఖల్సా కన్నీటి పర్యంతమయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)