16 నుంచి ఇంటర్ క్లాసులు

Telugu Lo Computer
0


కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ కాలేజీలు మూతబడిన సంగతి తెలిసిందే.  ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం  ఇంటర్మీడియట్ క్లాసులు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.  ఈనెల 16 నుంచి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ క్లాసులు నిర్వహించిననున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాలేజీల ప్రాంభానికి సమయం దగ్గర పడుతున్నందున సంబంధిత కాలేజీల ప్రిన్సిపాళ్లు కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని పేర్కొంది.  కరోనా కారణంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం ఇటీవలే అందర్నీ పాస్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)