85 మంది సైనికులతో వెళ్తున్న సైనిక విమానం సి-130 కుప్పకూలింది. ఫిలిప్పీన్స్లోని జోలో ద్వీపం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఇప్పటి వరకు 40 మంది జవాన్లను రక్షించినట్లు ఆర్మీ చీఫ్ సిరిలిటో సొబెజనా తెలిపారు. మిగతావారిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామన్నారు. సులు ప్రావిన్స్లోని జోలో ద్వీపంలో ల్యాండ్ అవుతుండగా రన్వేను చేరుకోవడంలో ఫ్లైట్ విఫలమవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సొబెజనా తెలిపారు. విమానంలో ఉన్నవారంతా ఇటీవలే ప్రాథమిక సైనిక శిక్షణ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లని సమాచారం.