విజయవాడ, గవర్నర్పేట పోలీస్స్టేషన్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పీఎస్ ఎదుట టీడీపీ, సీపీఎం కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. కౌన్సిల్ నుంచి తమను ఎందుకు అరెస్ట్ చేసి తీసుకొచ్చారో చెప్పాలని గవర్నర్పేట పీఎస్ ఎదుట వారు బైఠాయించారు. దాంతో పోలీసులు, కార్పొరేటర్స్కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పీఎస్కు చేరుకున్నారు.