టాలీవుడ్లో బ్లాక్బస్టర్ అందుకున్న ‘ఛత్రపతి’ రీమేక్తో హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నారు తెలుగు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమా రీమేక్ బాధ్యతలను వి.వి.వినాయక్ తీసుకున్నారు. శుక్రవారం ఉదయం ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ఇందులో భాగంగా హైదరాబాద్లో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు షాట్లో భాగంగా శ్రీనివాస్పై రాజమౌళి క్లాప్ కొట్టారు.
Post a Comment
0Comments
3/related/default