టెక్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు కరోనా మహమ్మారి బోనస్ కింద రూ.లక్ష అందించనుంది. కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో ఉద్యోగులకు బాసటగా నిలవాలనే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల లేదా ఆగస్ట్ నెలలో ఈ బోనస్ డబ్బులు ఉద్యోగుల అకౌంట్లలోకి చేరనున్నాయి. మైక్రోసాఫ్ట్కు ప్రపంచ వ్యాప్తంగా 1,75,508 మంది ఉద్యోగులు ఉన్నారు. దీని వలన కంపెనీకి 200 మిలియన్ డాలర్ల మేర భారం పడనుంది. అయితే గిట్హబ్, లింక్డ్ఇన్, జెనిమ్యాక్స్లో పని చేసే ఉద్యోగులకు ఈ బోనస్ వర్తించదు.
Post a Comment
0Comments
3/related/default