కంటిచూపు వచ్చింది..!

Telugu Lo Computer
0

 

మహారాష్ట్రంలో వాషిమ్ జిల్లా బెందర్ వాడి గ్రామానికి చెందిన మధురాబాయి బిద్వే అనే 70 ఏళ్ల వృద్ధురాలికి కంటిశుక్లం సమస్యతో 9ఏళ్ల క్రితం చూపు కోల్పోయింది. అప్పటినుంచి ఆమె చీకటి జీవితాన్నే గడుపుతోంది. ఆమె తన బంధువులతో కలిసి రిసోడ్ తహసీల్ లో నివాసముంటోంది.ఈమధ్య  కరోనా మహమ్మారి సోకకుండా ఉండేందుకు  మధురాబాయి బంధువుల సహాయంతో జూన్ 26న వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి కోవిషీల్డ్ వ్యాక్సిన్' మొదటి డోసు వేయించుకుంది. ఆ తరువాత ఆమెకు కంటిచూపు క్రమంగా మెరుగుపడుతూ వచ్చింది. అలా ఇప్పుడు 30 నుంచి 40 శాతం దాకా కంటిచూపు కనిపిస్తోందని తాను వ్యాక్సిన్ వేయించుకున్న తరువాతే తనకు కంటిచూపు మెరుగుపడుతోందని మధురాబాయి ఆనందంగా చెబుతోంది. కోవిషీల్డ్ టీకా తీసుకున్న మరుసటి రోజు కంటిచూపు రావడంతో మధురాబాయి సంతోషంలో ఉబ్బి తబ్బిబ్బు అవుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)