చాలా మంది టచ్ లో ఉన్నారు

Telugu Lo Computer
0

 

 చాలా మంది ఇతర పార్టీల నేతలు టచ్ లోకి వస్తున్నారని, ముగ్గురు కీలక సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఈ రోజు మా పార్టీలోకి వచ్చారని రేవంత్ అన్నారు. కౌశిక్ మాటలు కాదు.. కేసీఆర్ మాట్లాడించిన మాటలు అవి అని రేవంత్ మండిపడ్డారు. రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులను నియమిస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని సామజిక వర్గాలకు కాంగ్రెస్ లో సమన్యాయం ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎల్ రమణకు నాలుగు సార్లు భోజనం పెట్టి కేసీఆర్ టీ.ఆర్.ఎస్ లోకి తీసుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. హుజురాబాద్ లో మా అభ్యర్థిని ఇప్పుడే చెప్పం, కానీ మంచి అభ్యర్థిని ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. తనకు కౌశిక్ వ్యవహారం ముందే తెలుసునని రేవంత్ రెడ్డి అన్నారు. టీ.ఆర్.ఎస్ తో టచ్ లో ఉన్నాడని తనకు సమాచారం ఉందని, అక్కడ కౌశిక్ కు టీ.ఆర్.ఎస్ టికెట్ ఇస్తారని అనుకోవడం లేదని రేవంత్ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)