పెళ్లి పేరుతొ వ్యక్తులను మోసం చేసి లక్షలు దండుకున్న నిత్య పెళ్లి కూతురు సుహాసినిని అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. సిఐ దేవేంద్రకుమార్ తెలిపిన వివరాల మేరకు పెళ్లిచేసుకొని మోసగించిందంటూ మూడో భర్త సునీల్కుమార్ జూన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఆ మాయలేడి కోసం గాలించారు. రెండేళ్ల క్రితం పెళ్లిచేసుకుని మోసం చేసిందని రెండో భర్త వినయ్ ఫిర్యాదు చేశారు. విస్తృతంగా దర్యాప్తు చేసిన పోలీసులు చివరికి ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. విచారణ క్రమంలో సుహాసిని వలపు వలలు తెలుసుకుని పోలీసులే నివ్వెరపోయారు. మొదట అనాథనంటూ యువకులతో మాటలు కలుపుతుంది. పరిచయం పెరిగాక ప్రేమిస్తున్నానంటూ ముగ్గులోకి దించుతుంది. తీరా పెళ్లయ్యాక భర్త వద్ద ఉన్న నగదు, నగలతో పరారవడాన్ని సుహాసిని అలవాటుగా మార్చుకుందని పోలీసులు గుర్తించారు. సునీల్ కన్నా ముందు మరో ఇద్దరిని సుహాసిని ఇదే తరహాలో పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇదంతా మొదటి భర్త సహకారంతోనే సుహాసిని చేస్తోందని తెలుసుకుని పోలీసులు అవాక్కయ్యారు.
Post a Comment
0Comments
3/related/default