తక్కువ ధరకు లాక్కున్నారు

Telugu Lo Computer
0


ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో అసైన్డ్ చట్టానికి తూట్లు పొడిచారని, దళిత రైతులను  బెదిరించి భూములను లాక్కున్నారన్న ఆరోపణలపై సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవిగో సాక్ష్యాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే మరోమారు మీడియా ముందుకొచ్చారు. దళిత రైతులను మభ్యపెట్టి భూములను

చంద్రబాబు, అండ్ కో లాక్కున్నారని ఆరోపిస్తూ వీడియోలను విడుదల చేశారు. రైతుల నుంచి మరొకరికి భూములు అమ్ముతున్నట్టు.. ఇకపై సీఆర్డీఏ ప్రయోజనాలన్నీ వారికే చెందుతాయంటూ అగ్రిమెంట్లు చేయిస్తున్న వీడియోలు సంచలనంగా మారాయి.

చంద్రబాబు అండ్ కో దళిత సోదరులను బెదిరించి భూములు లాక్కున్నారని.. తమకు ఇష్టం వచ్చిన వారిని లిస్టులోకి ఎక్కించారని ఆయన ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో సుమారు నాలుగైదు వేల ఎకరాల భూములను కొట్టేసేందుకు ప్లాన్ చేశారన్నారు. చంద్రబాబు, అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణ కలసి దళితులను మోసం చేశారని.. వారికి కొందరు అధికారులు కూడా సహకరించారని ఆయన అన్నారు. తాము సమర్పించిన వీడియో సాక్ష్యాలతో కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసి.. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆర్కే కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)